పవన్ కల్యాణ్ పూటకో మాట మాట్లాడుతుంటాడు : అంబటి రాంబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు రహస్య బంధాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం పవన్, చంద్రబాబు కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు.

Ambati Rambabu Political Counter To Pawan Kalyan

పవన్ కల్యాణ్ పూటకో మాట మాట్లాడుతుంటాడని, అలాంటి పవన్ కల్యాణ్… చంద్రబాబుతో కలిసి తమను ఏమీ చేయలేరని అంబటి స్పష్టం చేశారు. సొంత రాష్ట్రంలో ఇల్లు లేని పవన్ కల్యాణ్, చంద్రబాబు ఎన్నికలవగానే హైదరాబాద్ వెళ్లిపోవాల్సిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. మరోవైపు వివేకా హత్య కేసును అదే పనిగా ప్రస్తావిస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news