నేడు రాష్ట్రానికి అమిత్‌ షా.. సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే కార్యక్రమానికి హాజరు

-

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు రాష్ట్రానికి రానున్నారు.ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన.. రేపు జరగబోయే కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్‌ఎఫ్‌) 54వ వ్యవస్థాపక దినోత్సవం (రైజింగ్‌ డే) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని  నార్త్‌ సెక్టార్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఏడీజీ) పీయూష్‌ ఆనంద్‌ తెలిపారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో ఈ నెల 12వ తేదీ ఉదయం 7.15 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు వివిధ ప్రదర్శనలు చేస్తాయన్నారు.

మరోవైపు అమిత్‌ షా హాజరయ్యే పార్టీ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. సంగారెడ్డిలో ఈనెల 12న జరగాల్సిన మేధావుల సమావేశం రద్దయింది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇవాళ రాత్రి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యే అంశం కూడా ఖరారు కాలేదని పేర్కొన్నాయి. ఇవాళ రాత్రికి హైదరాబాద్‌ చేరుకునే అమిత్‌ షా ఆదివారం ఉదయం సీఐఎస్‌ఎఫ్‌ అధికారిక కార్యక్రమంలో మాత్రం పాల్గొంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news