అమిత్ షా: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్ల జాతరే !

-

కర్ణాటకలో మే రెండవ వారంలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది, అందుకే ఎలాగైనా అధికారంలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలలో బిజీ గా ఉన్నారు. కాగా అందులో భాగంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కర్ణాటక ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ ప్రచారంలో అమిత్ షా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో మళ్ళీ బీజేపీకి మీ ఓటు వెయ్యాలని ప్రజలను కోరారు. కాగా కర్ణాటకలో బీజేపీ తర్వాత ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ కు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు వెయ్యరాదని అమిత్ షా ప్రజలను కోరారు.

ఒకవేళ మీరు కాంగ్రెస్ ను కనుక గెలిపిస్తే రాష్ట్రము అంతటా అల్లర్లు తట్టుకోలేరని అమిత్ షా సెటైర్ వేశాడు. మరి అమిత్ షా మాట ఎందరు విని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news