అమితాబ్ బచ్చన్ గాయాలు..వైద్యులు ఏమన్నారంటే?

-

బాలివుడ్ బాద్షా అమితాబచ్చన్ ఈ వయస్సులో కూడా వరుస సినిమాలతో పాటు,షో లను కూడా చేస్తూ వస్తున్నాడు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో వున్నట్లు ఓ వార్త షికారు చేస్తుంది.కౌన్​ బనేగా కరోడ్ పతి’ షోలో గాయం అయింది. ఈ మేరకు అమితాబ్​ తన బ్లాగ్​లో వివరాలు వెల్లడించారు. షో చేస్తున్న సమయంలో చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి తగిలి నరం కట్​ అయిందని చెప్పారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రక్త స్రావాన్ని ఆపడానికి కొన్ని కుట్లు కూడా వేశారని తెలిపారు. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాని.. అభిమానులు ఆందోళని చెందవద్దని కోరారు బిగ్ బీ.

ఇనుప ముక్క తగిలి నరం కట్​ అయింది. రక్త స్రావం కూడా జరిగింది. రక్తా స్రావాన్ని ఆపడానికి కుట్లు వేశారు. షో స్టాఫ్​ టీమ్​, డాక్టరు అక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు వాకింగ్​ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారు అని అమితాబ్​ బచ్చన్ అన్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన ఫ్యాన్స్ ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మరి కొంత మంది ఆయన షూ వేసుకున్నా కూడా ఎలా గాయం అయ్యింది..షో యాజమాన్యం సరిగ్గా లేనందున ఇలా జరిగిందని మండిపడుతున్నారు..

చివరిసారిగా బిగ్​బీ అయాన్​ ముఖర్జీ తెరకెక్కించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కనిపించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సూరజ్​ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న ‘ఉంచాయి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నీనా గుప్తా, అనుపమ్​ ఖేర్, పరిణీతి చోప్రా, బోమన్​ ఇరానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నవంబర్​ 11న విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news