ఆనం సెన్సేషనల్ కామెంట్స్: టీడీపీతో టచ్ లో 70 శాతం వైసీపీ ఎమ్మెల్యేలు !

-

ఏపీ రాజకీయాల గురించి నిత్య ఏదో ఒక వార్త సంచలనంగా మారుతూ ఉంటుంది. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి వైసీపీ గురించి సంచలన కామెంట్స్ చేయడంతో మళ్ళీ రాజకీయాలు హీటెక్కాయి అని చెప్పాలి. తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో 70 శాతం మంది టీడీపీతో టచ్ లో ఉన్నారని.. ఇంకా సమయం గడిచే కొద్దీ ఇది కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా సంఖ్య పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

జగన్ పాలన పట్ల సొంత పార్టీ నాయకులే ఈ సైకో పాలన మాకొద్దు బాబోయ్ అంటున్నారు అని వక్రీకరించి మాట్లాడారు. ఇలా రోజు రోజుకి వైసీపీ పై వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు కదా.. డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని రెచ్చిపోయి మాట్లాడారు. మరి ఈయన చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news