సజ్జల కోట్లు ఎలా సంపాదించారో తెలుసు : వైసీపీ ఎమ్మెల్యే ఆనం ఫైర్‌

-

సజ్జల కోట్లు ఎలా సంపాదించారో తెలుసు అని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి ఫైర్‌ అయ్యారు. వైసీపీ పార్టీ తనను సస్పెండ్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి స్పందించారు. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాననడం బురదజల్లే ప్రయత్నమేనని వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.

ఆనం ఓటును పరిగణలోకి తీసుకోమని సజ్జల చెప్పిన విషయం గుర్తుచేశారు. తాను క్రాస్ ఓట్ వేశానని చెప్పడానికి నువ్వు ఎవరని ప్రశ్నించారు. విలేఖరి స్థాయి నుంచి సజ్జల కోట్లు ఎలా సంపాదించారో తనకు తెలుసు అన్నారు. తన నియోజకవర్గానికి ఇంచార్జ్ ని నియమించిన రోజు నుంచే పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news