రాష్ట్రంలో అవినీతిని అదుపులో పెట్టి.. రౌడీయిజానికి స్వస్తి పలకాలి: ఆనం వెంకటరమణారెడ్డి

-

వైసీపీ ప్రభుత్వం పై టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతిని అదుపులో పెట్టి.. రౌడీయిజానికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. జగన్ సూట్కేస్ కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడిన విషయం అందరికీ తెలుసునని, రక్త చరిత్ర కూడా తెలిసిందేనని అన్నారు. వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం మానుకోవాలన్నారు. లిక్కర్ అండ్ డిస్టలరీస్ అసోసియేషన్ మీడియా సమావేశం పెడితే.. అదాన్ డిస్టిలరీస్ కంపెనీ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న దానిలో ఉండాల్సినవి లేవని.. ఉండకూడనివి ఉన్నాయన్నారు. ఫ్రాన్స్ కు నల్లధనం తరలించారనే ఊహాగానాలు ఉన్నాయని.. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉందన్నారు ఆనం వెంకటరమణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news