తన కారుకు పేరు పెట్టండి అంటున్న ఆనంద్‌ మహీంద్రా

-

మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్ర చాలా విషయాలను పంచుకుంటారు. అయితే.. తాజాగా.. మహీంద్రా సంస్థ తన స్కార్పియో వాహనాన్ని మరింత అభివృద్ధి చేసి, ఇటీవలే స్కార్పియో-ఎన్ వాహనాన్ని లాంచ్ చేసింది. మహీంద్రా తన కొత్త మోడల్ ద్వారా ఎస్ యూవీ సెగ్మెంట్లో మరోసారి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. కాగా, స్కార్పియో-ఎన్ వాహనాన్ని బుక్ చేసుకున్న వారిలో మహీంద్రా వ్యాపార సామ్రాజ్య అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు.

Image

ఆయన ఇవాళ తన కొత్త స్కార్పియో-ఎన్ కారును అందుకున్నారు. షోరూం ఎగ్జిక్యూటివ్ ఆయనకు కారు తాళాలు అందించారు. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇవాళ తన జీవితంలో మరపురాని రోజని తెలిపారు. కొత్త స్కార్పియో-ఎన్ వాహనాన్ని అందుకున్నానని వెల్లడించారు. అంతేకాదు, తన కొత్త కారుకు పేరు సూచించాలని నెటిజన్లను కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాల పేర్లు సూచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news