BREAKING : అనంతపురం JNTU హాస్టల్‌ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

-

BREAKING : అనంతపురం JNTU హాస్టల్‌ లో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జేఎన్టియులో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాణక్య నందారెడ్డి(19) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం తెల్లవారుజామున ఎల్లోరా వసతి గృహం పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

విద్యార్థి స్వస్థలం నెల్లూరు జిల్లా ఉదయగిరి. చదువులో చురుగ్గా ఉండే నందారెడ్డి, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news