యూట్యూబ్ ఛాన‌ల్స్ పై యాంక‌ర్ అన‌సూయ ఫైర్

-

జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ అన‌సూయ కామెడీ షోల తో పాటు సినిమాలలోనూ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టి కే మెగా ప‌వ‌ర్ రామ్ చ‌రణ్ రంగ‌స్థలం సినిమాలో రంగ‌మ్మ అత్త పాత్ర‌తో బాగా పాపులర్ అయ్యారు. తాజాగా ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో ద‌క్షాయ‌ణి అనే పాత్ర‌తో కూడా తెలుగు ప్ర‌జ‌ల‌ను మెప్పించింది. దీంతో అన‌సూయ కు వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. అయితే ఇటీవ‌ల అనసూయ పోస్ట‌ర్ ఒక‌టి విడుద‌ల అయింది. బెడ్ ప‌డుకుని ఉన్న అన‌సూయ ఫోటో వైర‌ల్ అయింది. అయితే ఈ ఫోటో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్లు అస‌భ్య‌క‌రంగా థంబ్ నైల్స్ పెటుడుతూ త‌న‌న అవ‌మానించార‌ని యాంక‌ర్ అన‌సూయ ఫైర్ అయింది.

త‌న ఫోటోల ప‌ట్ల అస‌భ్య‌ర‌మైన థంబ్ నైల్స్ పెడుతున్నారని ఆగ్ర‌హించింది. త‌న బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేయ‌డం ఎంట‌ని ప్ర‌శ్నించింది. అయితే గ‌తంలో కూడా ఇలాంటివి వ‌చ్చినా.. త‌ను ప‌ట్టించుకోలేద‌ని అన్నారు. కానీ ప్ర‌తిసారి స్ట్రాంగ్ ఉండ లేమ‌ని అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాన‌ని అన్నారు. అయితే తాను కూడా అలాగే మాట్లాడ‌గ‌ల‌ను అని అన్నారు. కానీ ఒక్కరిని నొప్పించ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అంటూ యూట్యూబ్ ఛాన‌ల్స్ పై ఆగ్ర‌హించింది.

Read more RELATED
Recommended to you

Latest news