AP: వైసీపీ సర్కార్ మరో కీలక నిర్ణయం…కొత్త మంత్రి వర్గంతో పాటు పార్టీ రిజినల్ కమిటీల ఏర్పాటు…!

-

ఆంధ్ర ప్రదేశ్ లో కేబినెట్ విస్తరణ తుది దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రానికి కొత్త మంత్రి వర్గంపై క్లారిటీ రానుంది. కొత్తగా 15 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోనునన్నట్లు తెలుస్తోంది. పాత మంత్రి వర్గం నుంచి 10 మంది మంత్రులను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసిన మంత్రుల రాజీనామా లేఖలు గవర్నర్ కు చేరాయి. కొత్త మంత్రి వర్గంలోని పేర్లు కూడా ఈరోజు మధ్యాహ్నానికి గవర్నర్ కార్యాలయానికి చేరాయి. సామాజికి సమీకరణాలు, సమర్థత, జిల్లాల అవసరాలను పరినణలోకి తీసుకుని మంత్రి వర్గం కూర్పు ఉండనుంది. ఇద్దరు గిరిజనులు, ఇద్దరు మైనారిటీలు, ఆరుగురు ఎస్సీలకు క్యాబినెట్ లో చోటు దక్కుతుందని తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే కొత్త మంత్రి వర్గంతో పాటు మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు జగన్ పార్టీ రిజినల్ కమిటీలు ఏర్పాటు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్… రాజీనామా చేసిన మంత్రులు పార్టీ బాధ్యతలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపిస్తే మళ్లీ మీరే మంత్రులు అంటూ హామీలు ఇచ్చారు. దీంతో ఈ రోజు పార్టీ రీజినల్ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news