ఏపీలో భారీగా తగ్గిన కరోనా : కొత్తగా 618 కేసులు

-

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 618 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,47, 459 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 06 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 142 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12, 482 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1178 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,20, 835 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38,069 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 81, 32, 713 కరోనా పరీక్షలు చేసి నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news