ఏపి కరోనా అప్డేట్ : కొత్తగా 693 కేసులు నమోదు

-

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు నేడు మళ్ళీ తగ్గాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… కొత్తగా 693 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,55 , 999 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 06 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,242 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 927 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,33 , 447 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 48 , 235 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 86, 60 , 811 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8310 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news