జనసేన పార్టీ కోసం పవన్ మరో సంచలన నిర్ణయం

-

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పుడుతున్న వేళ జనసేనాని పవన్ కల్యాణ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్వాహన అవసరాల కోసం ఏకంగా రూ.10 కోట్లను పవన్ కళ్యాణ్ విరాళంగా అందించారు. ఇప్పటికే షూటింగ్ నుంచి వచ్చిన డబ్బును ప్రజల కోసం ఖర్చు చేస్తున్న పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని కూడా పార్టీ అవసరాల కోసం విరాళం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమ నేతల స్ఫూర్తితో తాను కష్టపడి సంపాదించిన డబ్బును పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు చేస్తూనే ఉంటానని అన్నారు.ఇందులో భాగంగా.. ఎన్నికల నిర్వహణ కోసం రూ. 10 కోట్ల చెక్కును జనసేన పార్టీ ట్రేజరి రత్నం గారికి అందజేస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.కాగా, ఈ నెల 30 నుంచి జనసేన ఎన్నికల శంఖారావాన్ని పిఠాపురం నుంచి మోగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పోస్టర్ ను జనసేన రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news