డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్దమేనా..? : సీఎం జగన్

-

ఈ కురుక్షేత్ర యుద్ధంలో డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్దమేనా అని ప్రశ్నించారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన మీరంతా సిద్దమేనా సభలో మాట్లాడారు జగన్.  ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ.. మన పార్టీ నాయకులు, అభిమానులు, వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి.. గడిచిన 58 నెలల్లో ఇంటింటికి మంచి జరిగి ఉంటే మీ జగన్ కి, వైసీపీ ప్రభుత్వానికి అండగా, తోడుగా నిలబడండి. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మంచి చేయగలిగాం.. కాబట్టి ఓట్లు అడుగగలుగుతున్నాం. ఎన్నికలు వస్తున్నాయంటే.. ప్రతిపక్షంలో ఉన్న వారంతా.. విడి విడిగా రాలేకపోతున్నారు.

ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారు. జెండాలు జత కట్టడమే వారి పని. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడని గర్వంగా చెబుతున్నాను. ప్రతీ గుండెల్లోనూ మీ బిడ్డ ఉన్నాడు. మన ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈ రోజు ఒక్కడి మీద ఎంత మంది దాడి చేస్తున్నారో చూడండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు నాయుడు, దత్తపుత్రుడు, కుట్రలు, కుతంత్రాలతో

Read more RELATED
Recommended to you

Latest news