చంద్రబాబు మీ ఖాతాల్లో రూపాయి అయినా వేశారా ? : సీఎం జగన్

-

టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎప్పుడైనా ప్రజల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా..? అని సీఎం జగన్ ప్రశ్నించారు. బడులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్ లు చూస్తే గుర్తొచ్చేది మీ జగన్. చంద్రబాబును చూస్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా..? బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి డబ్బులు వేశాం. విశ్వసనీయత ఒక వైపు.. మోసం మరోవైపు ఉన్నాయి. ఏది కావాలో తేల్చుకోండి అని సీఎం పేర్కొన్నారు.

ప్రజల ఓటు విలువ వారి ఐదేళ్ల భవిష్యత్ అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు. చంద్రబాబుకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు. ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షాన ఉన్నాను. ఒక్కడి మీద అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారు. మీ ఓటు వల్ల మీ తలరాతలు మారతాయి. ఎవరి వల్ల మంచి జరిగిందో తెలుసుకొని ఓటు వేయండి. ఈ ఎన్నికల్లో వైసీపీకి తోడుగా ఉండండి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news