ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్త..!

-

రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ  తరుణంలోనే నిన్న రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. డీజీపీని బదిలీ చేయాలని గత కొద్ది రోజులుగా కూటమి నేతలు చేస్తోన్న ఫిర్యాదులకు ఈసీ స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీశ్కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి సమాచారం అందించింది.  ఈ నేపథ్యంలో నూతన డీజీపీ పోస్టులో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపింది. సీనియార్టీ జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీశ్ కుమార్ గుప్తా పేర్లను సిఫార్సు చేయగా హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఎంపిక చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news