దేశంలో ఏ పార్టీ 99 శాతం మేనిఫెస్టో అమలు చేయలేదు : మంత్రి బొత్స

-

దేశంలో ఏ పార్టీ 99 శాతం మేనిఫెస్టో అమలు చేయలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇవాళ వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టో విడుదల చేశారు. 2019లో విడుదల చేసిన మేనిఫెస్టోను ఐదేళ్లలో 99 శాతం అమలు చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన హామీలను కూడా తప్పకుండా అమలు చేస్తారు.

దేశంలో ఏ పార్టీ కూడా ఇలా అమలు చేయలేదని పేర్కొన్నారు. చంద్రబాబు మాయ మాటలను ఎవ్వరూ నమ్మరని పేర్కొన్నారు. పెన్షన్ల విషయంలో జగన్ పెంపు హర్షణీయమన్నారు. అలాగే రైతు భరోసా, ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లకు కూడా ప్రమాద భీమా కల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు. కొత్తగా ఆటో, కారు, లారీ వంటి వాహనాలను కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. జగనన్న ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారు. మళ్లీ గెలిపిస్తే.. మళ్లీ ఇచ్చినటువంటి హామీలన్నింటిని తూచ తప్పకుండా అమలు చేస్తారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news