బీజేపీ ప్రెసిడెంట్స్ అందరూ డమ్మిగాళ్లు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ ప్రెసిడెంట్స్ అందరూ డమ్మిగాళ్లు అని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆఫీస్ లో ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్లు రాసి ఇచ్చిందే వాళ్లు మాట్లాడుతారని పేర్కొన్నారు. ప్రస్తుత తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఓ స్క్రిప్ట్ రీడర్ అని సెటైర్ వేశారు. భారత సంప్రదాయం గురించి కిషన్ రెడ్డికి తెలియదన్నారు. సోనియాగాంధీ కుటుంబంలో ఇద్దరూ కుటుంబ పెద్దలను దేశం కోసం కోల్పోయారని.. గాంధీ కుటుంబం దేశ ప్రజల కుటుంబం అన్నారు.

సోనియాగాంధీ 22 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారని.. ప్రధాని కావాలనుకుంటే రెండుసార్లు అయ్యేవారని పేర్కొన్నారు. అలా కాకుండా పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులను చేశారని గుర్తు చేశారు. మోడీని ప్రధాని చేసిన అధ్వానికి అయోధ్యలో కనీసం శాలువా కూడా కప్పలేదని విమర్శించారు. సోనియాగాంధీని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని హెచ్చరించారు. గ్రామీణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news