నగ్నంగా పూజలు చేస్తే డబ్బులంటూ మోసం.. 12 మంది అరెస్ట్

-

గుంటూరు జిల్లాలో ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. నగ్నంగా పూజలు చేస్తే రూ.50 వేలు ఇస్తామంటూ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఓ మహిళ, ఇద్దరు యువతులను నమ్మించాడు. వారితో చిలకలూరిపేట, గుంటూరులో పూజలు చేయించాడు. ఈ క్రమంలో వారిపై అత్యాచారానికి పాల్పడి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో బాధితులు దిశా యాప్ కి ఫోన్ చేయడంతో పోలీసులు వారిని రక్షించారు. ఈ సందర్భంగా సౌత్ డీఎస్పీ మెహబూబ్ బాషా మాట్లాడుతూ.. క్షుద్ర పూజలు, యువతుల పై అత్యాచారం కేసులో పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

క్షుద్ర పూజల నేపథ్యంలో యువతులను లైంగికంగా వేధించారని తెలిపారు. పూజల కోసం అమాయకులైన పేదింటి యువతులకు వల వేస్తున్నారని.. ఒక్క రోజు పూజలో కూర్చుంటే యాభై వేలు ఇస్తామని మభ్యపెట్టి తీసుకు వెళ్లారని వివరించారు. పూజలు చేసిన అనంతరం యువతులపై అత్యాచారం చేశారని తెలిపారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి పూజలు చేసి బంగారం సృష్టి స్తానని నమ్మ బలికాడని.. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news