TTD : తిరుమల సర్వదర్శనానికి 04 గంటల సమయం

-

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 04 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది.

ttd

అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 64,512 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 23,491 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అంతేకాకుండా… నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.

కాగా, ఇక నుంచి భక్తులు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేందకు వీలుగా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీ కాగానే నేరుగా వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ లింక్‌ పంపుతున్నారు. భక్తులు దానిపై క్లిక్‌ చేసి పేమెంట్‌ గేట్‌వే ద్వారా నగదు చెల్లిస్తే బ్రేక్‌ దర్శన టికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలా అనంతరం టికెట్‌ను ప్రింట్‌ తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news