ఏపీలో 45,355 టీచర్ పోస్టులు ఖాళీ..వివరాలు ఇవే

-

ఏపీలో 45,355 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, వీటికి ప్రాధాన్యమిచ్చి భర్తీ చేయాలని కేంద్ర ప్రాజెక్టు ఆమోదిత మండలి వెల్లరించింది.

కేంద్ర విద్యా శాఖకు రాష్ట్రం నుంచి అందిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల ప్రకారం 45,355 ఖాళీలు ఉన్నట్లు బహిర్గతం చేసింది. గత పిఏబి లోను ఇదే అంశాన్ని ప్రస్తావిం చిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు. అవి కరోనా సమయంలో ఖాళీలని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ఇప్పుడు కేంద్రం మళ్ళీ అదే సంఖ్యను వెల్లడించింది. మంత్రి బొత్స ఒకపక్క డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేస్తుండగా… విద్యా శాఖ మాత్రమే 717 ఎస్జీటీ ఖాళీలే ఉన్నాయంటూ కేంద్రానికి వెల్లడించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news