టీడీపీ తో టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు : గోరంట్ల

-

రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరూ వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేస గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పరిటాల రవి వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారు. వాస్తవానికి గంటా శ్రీనివాసరావు మూడేళ్ల కిందట 2021 ఫిబ్రవరి 12న రాజీనామా చేస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు రాజీనామాను స్పీకర్  ఆమోదించారని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టీడీపీలో చేరుతున్నారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో దోపిడీ చేశారు. జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉంది..? కేసుల నుంచి తప్పించుకోవడం ఆయనకు అలవాటు అయిపోయింది అని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news