రాజకీయాల్లోకి నటుడు సప్తగిరి.. ఆ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటన!

-

రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యాడు సినీ నటుడు సప్తగిరి. నేడు తిరుపతిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సప్తగిరి మీడియా తో మాట్లాడుతూ.. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే తనకు చాలా ఇష్టమని.. త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నానని అన్నారు.

ఇక తుది నిర్ణయం ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ దే అని వివరించారు. తనది చిత్తూరు జిల్లానే అని, ఐరాల ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించానని చెప్పారు సప్తగిరి. పేదలకు సేవ చేయడానికి ఏ అవకాశం వచ్చినా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రావడాని అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని తెలిపారు. అయితే తనకి సినిమాల కారణంగానే రాజకీయంగా అవకాశాలు వచ్చాయని.. ఎట్టి పరిస్థితులలో సినిమాలను వదిలేసే ప్రసక్తే లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news