ఏపీలో ప్రతి సెకన్ కు ఒక మొబైల్ ఫోన్ తయారీ: మంత్రి అమర్నాథ్

-

ఏపీలో ప్రతి సెకన్ కు ఒక మొబైల్ ఫోన్ తయారీ జరుగుతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. మూడు లక్షల ఎస్ ఎఫ్ టీతో స్టార్టప్ టవర్ ను కూడా నిర్మించాలని ఇటీవల సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను త్వరలో చేపట్టబోతున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సెకనుకు ఒక మొబైల్ ఫోన్ తయారవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నట్టుగా చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు కాన్సెప్ట్ సిటీలు అభివృద్ధి చేస్తామని.. అనంతపురం, విశాఖ, తిరుపతిలో ఐటీ సిటీల నిర్మాణం చేస్తామని ప్రకటించారు మంత్రి అమర్నాథ్. మూడు లక్షల ఎస్.ఎఫ్.టి.తో ఐకానిక్ టవర్స్ నిర్మాణం చేయబోతు న్నామని… భోగాపురం దగ్గర ఐటీ కాన్సెప్ట్ సిటీ రానుందని వివరించారు మంత్రి అమర్నాథ్.

2023-2028 కోసం ఇండస్ట్రియల్ పాలసీని అమల్లోకి తీసుకుని వస్తామని మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్టంలో పరిశ్రమలు పెట్టడానికి ఉన్న వనరులను షోకేస్ చేస్తామని.. 3వ తేదీన సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను సీఎం ప్రారంభిస్తారని.. 4వ తేదీన ముఖ్యమంత్రి సమక్షంలో కీలక ఒప్పందాలు జరుగనున్నాయని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news