చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు – అంబటి రాంబాబు

-

పల్నాడు జిల్లా మాచర్లలో విధ్వంసానికి కారకుడు చంద్రబాబు అని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఫ్యాక్షన్ నేర చరిత్ర ఉన్న బ్రహ్మ రెడ్డి ని మాచర్ల టిడిపి ఇన్చార్జిగా నియమించడం ద్వారా చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దాడులు చేయాలని చంద్రబాబు బహిరంగ సభలలోనే రెచ్చగొట్టి మాట్లాడిన సంగతి గుర్తు చేశారు. ప్లాన్ ప్రకారమే మాచర్లలో టిడిపి నేతలు దాడులు చేశారని ఆరోపించారు మంత్రి అంబటి.

మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని ఓడించే శక్తి చంద్రబాబుకు గాని, ఆయన ఇన్చార్జిగా పెట్టిన బ్రహ్మ రెడ్డి కి గాని దేవుని స్పష్టం చేశారు. మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆద్యం పోసిందే బ్రహ్మ రెడ్డి అని అన్నారు. బ్రహ్మారెడ్డి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, వైఎస్ఆర్సిపి కార్యకర్తలని దారుణంగా కొట్టారని.. అయినా వైఎస్ఆర్సిపి ప్రశాంత వాతావరణ కోరుకుంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోటిని కూడా పీకలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news