జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరతే లేదు: అంబటి

-

జగన్ ప్రభుత్వం వచ్చాక నీటి కొరతే లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు కృష్ణా డెల్టాకు ఖరీఫ్ సీజన్ కోసం నెల ముందుగానే నీటిని విడుదల చేసినట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి 1000 క్యూసెక్కుల నీటిని మంత్రి అంబటి విడుదల చేశారు. త్వరగా ఖరీఫ్ ప్రారంభం కావడం వల్ల 3 పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. పులిచింతలలో 34 TMCల నీరుఉందని… పట్టిసీమ నుంచి మీరు తెచ్చే అవసరం లేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఏపీలో నీటి కొరతే లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news