అంబటి రాయుడు ట్వీట్ వైరల్.. ఆ విషయంలో మళ్లీ యూటర్న్ తీసుకోనున్నారా..?

-

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గతంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు అతి కొద్దీ రోజుల్లోనే పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం అందరికి సుపరిచితమే. అయితే అంబటి రాయుడు ఎవరూ ఊహించని విధంగా తిరిగి వైసీపీ గూటికి చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అంబటి రాయుడు ఈ రోజు తెల్లవారు జామున మూడు గంటలకు ట్విట్టర్ (X) వేదికగా సిద్ధం అని పోస్ట్ చేశారు. వైసీపీ సిద్ధం పేరుతో పలు ప్రచార కార్యక్రమాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అంబటి రాయుడు యూటర్న్ తీసుకుని తిరిగి వైసీపీలో చేరనున్నారా అనే అనుమానాలు రేకేత్తుతున్నాయి అంటున్నారు విషయం తెలిసిన ప్రజలు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం అంబటి రాయుడు వైసీపీలో చేరాలా..? కూటమి వైపు పోవాలా..? అని ఆలోచిస్తూ.. ఎటూ తేల్చుకోలేక అయోమయంలో ఉన్నారని పేర్కొంటున్నారు. కాగా అంబటి రాయుడు సిద్ధం అని పోస్ట్ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ పోస్ట్ చేసారో తెలీదుగానీ.. వైసీపీ అనుచరులు మాత్రం రాయుడు పోస్ట్ ను వాళ్లకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news