త్వరలోనే కుప్పంకి విమానశ్రయం వస్తుంది : చంద్రబాబు

-

త్వరలోనే కుప్పంకి విమానశ్రయం వస్తుంది ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశాడు. ఇవాళ కుప్పంలో పర్యటించిన ఆయన బస్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. “నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మొన్నటి ఎన్నోకల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం.

 


అహంకారంతో విర్రవీగితే.. ప్రజాస్వామ్యంలో వైసీపీకి  పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా. మొన్నటి ఎన్నికల్లో సామాజిక న్యాయానికి పెద్దపేట వేశాం. కేబినెట్లో 8మంది బీసీలకు అవకాశం కల్పించాం. వైసీపీ పాలన పీడకల.. అలాంటిది ఎప్పుడూ చూడలేదు అన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news