పార్టీ ఫిరాయింపులపై తొలిసారి స్పందించిన కేసీఆర్

-

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డ తరువాత బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అయిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చ జరగుతోంది. స్థానికల ఎన్నికల కంటే ముందే మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్కెచ్ వేశారు.ఈ మేరకు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేను కాపాడుకునేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో వారితో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం పార్టీలో జరగుతున్న పరిణామాలపై కేసీఆర్ వారితో చర్చించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు పార్టీ మారడాన్ని ఏ మాత్రం పట్టించుకోవద్దని ,కొందరు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి చాలా జరిగినా.. తమ ఎమ్మెల్యేలు ఏ మాత్రం తొణకలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు, ఘోరాల సంఖ్య విపరీతంగా పెరిగిందని మండిపడ్డారు.శాంతిభద్రతలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని కేసీఆర్ అన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌ పార్టీకి మంచి రోజులు వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులను తరచూ కలుస్తానంటూ కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news