చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది – అనిల్ కుమార్ యాదవ్

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో రూ. 370 కోట్ల దోపిడీతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారని అన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అయినప్పటికీ.. ఆయన పాపం పండే రోజు వచ్చిందని విమర్శించారు. నాకు ఏమీ లేదని చెప్పే చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకున్నారని విమర్శించారు.

అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయకూడదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ కు ప్రజల్లో స్పందన లేకపోవడంతో దత్తపుత్రుడుని తీసుకువచ్చి హంగామా చేశారని దుయ్యబట్టారు. ఆయన అరెస్టుతో టిడిపి మరింత దిగజారిందన్నారు. ఈ కేసులో తీగ లాగితే డొంక అంతా కదులుతుందన్నారు అనిల్ కుమార్ యాదవ్. కేసుతో సంబంధం లేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news