జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు శాశ్వతం..!

-

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో “గాజు గ్లాసు” గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి. ఈ ఎన్నికల్లో JSP 21 MLA, 2 MP స్థానాలు దక్కించుకోవడంతో సింబల్ టెన్షన్ తీరిపోయింది.

 

త్వరలోనే EC అధికారికంగా ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఇవ్వనుంది. కాగా, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి, కీలకమైన మంత్రి పదవి వస్తుందని తెలుస్తోంది. అయితే జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో మాత్రం ఈ అంశం నిరాశ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news