పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేసిన జనసేన

-

జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్  గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేసింది జనసేన. ఈ సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి శాలువా కప్పి సన్మానించారు వర్మ. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతోంది. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటాం. రెండింటి మధ్య సాంకేతిక అంశాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది.

త్వరలో జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. 24 గంటలు పార్టీ కార్యాలయం అందుబాటులో ఉండేలా పని చేయాలనేది నా కోరిక. అర్థరాత్రి, అపరాత్రుళ్లు కూడా జనసేన అందుబాటులో ఉండేలా ప్రణాళికలు. విద్యా, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, శాంతి భద్రతలపై ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. ఢిల్లీ వెళ్లి వచ్చాక లెజిస్లేటీవ్ మీటింగ్ పెట్టుకుందాం. ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైంది. అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లూ గెలిచాం. పోటీ చేసిన అన్నీ సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదన్నారు. దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేనే అని చెప్పారు. పవన్  కు అంత మెజార్టీ వస్తుంది.. ఇంత మెజార్టీ వస్తుందంటుంటే.. నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి.ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారు. ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతమే తీసుకుంటాను.

 

Read more RELATED
Recommended to you

Latest news