మంత్రి రోజాకు చీరలు, నగలు గురించి తప్ప ఇంకేం తెలుసు..? : పంచుమర్తి అనురాధ

-

అమరావతి : మంత్రి రోజాపై టీడీపీ ఏపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఫైర్‌ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్సుకు ఏ కేసు ఎప్పుడొచ్చి మీద పడుతుందోననే భయంతో జగన్ అట్ట తుపాకీలా మారారని… మంత్రి రోజాకు చీరలు, నగలు గురించి తప్ప ఇంకేం తెలుసు..? అని నిలదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతుంటే బోట్ షికారుల్లో ఆమె బిజీగా ఉందని.. హోం మంత్రి పదవి ఇప్పించిన వారి ఇళ్లు చుట్టూ తిరిగి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్ప ఒక్క సమీక్ష కూడా జరిపే తీరిక వనితకు లేదని నిప్పులు చెరిగారు.

మంత్రి పదవి కోసం పరితపించిపోయిన విడదల రజినికి అత్యాచార బాధితురాలికి అందుతున్న వైద్యం సమీక్షించే తీరిక లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు సినీ తారలతో పోటీపడుతున్నట్లు ఉంది మహిళా మంత్రుల వస్త్రధారణ ఉందని… చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని నిందించేందుకే వీరు మంత్రి పదవులు తెచ్చుకున్నారు తప్ప మహిళా సమస్యల పరిష్కారం కోసం కాదన్నారు. పోలీస్ కాన్వాయిలతో ట్రాఫిక్ సమస్యలు సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం హంగుగా మంత్రులు భావిస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news