ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

-

 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. ఇవాళ్టి నుంచే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉపయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.

గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేయనుంది బీఏసీ. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఇవే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈనెల 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శనివారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news