ఆర్-5 జోన్‌లో నిర్మాణాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

-

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ భేటీలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలోని ఆర్‌5 జోన్‌లో 47 వేల ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు – మూలపేట పోర్టు నిర్మాణం కోసం రూ.3,880 కోట్లు రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు వ్యవసాయ భూమి, లంక భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.

అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద  జిందాల్  న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్ల పంపెడ్ స్టోరేజి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. టిడ్కో కాలనీల్లోని 260 ఎకరాలను విక్రయించడం తోపాటు హడ్కో నుంచి 750 కోట్లు రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది.  గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 454 కోట్ల పరిహార ప్యాకేజీ మంజూరుకు కేబినెట్ ఆమోదం. రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన ప్రాజెక్టులను మంత్రివర్గం ఆమోదించింది.

Read more RELATED
Recommended to you

Latest news