ఏపీలో పెరుగుతున్న కరోనా.. కొత్తగా 2527 కేసులు నమోదు

-

ఏపీ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2527 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,43,854 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో 19 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,197 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,06,718 లక్షలకు చేరింది.  ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 86,280 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 38 , 38, 636 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక గడిచిన 24 గంటల్లో 2412 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news