ఏపీ లో ఆగని కరోనా ప్రయాణం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ద్వారా మీడియాకు తెలపడం జరిగింది. ఇక ఈ హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్నటి రోజు 16,882 శాంపిల్స్ పరీక్షించగా అందులో 1500 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. వీరితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 55 మంది కూడా కరోనా పాజిటివ్ రావడంతో మొత్తంగా 1555 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కేసులు సంఖ్య చూస్తే 23,814 కు చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 11,383 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.

carona ap
carona ap

మరోవైపు గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 904 మంది కరోనా బారి నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సంఖ్యతో రాష్ట్రవ్యాప్తంగా నేటి వరకు 12,154 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో నేటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 277 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news