నేడు ఏపీ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా !

-

నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఉదయం 10 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక నిజానికి ఏపీ ఎంసెట్‌ ఫలితాలు నిన్ననే విడుదల కావలసి ఉన్నా, అవి ఈ రోజుకు వాయిదా పడ్డాయి. తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో వచ్చిన తప్పులు, విద్యార్ధులు పడుతున్న తిప్పల నేపథ్యంలో ఫలితాలను పరిశీలించడానికి ఈరోజుకు వాయిదా వేశారు.

ఇక పది గంటల తరువాత ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://sche.ap.gov.in/ లో చెక్‌ చేసుకోవచ్చు. గత నెల 17, 18, 21, 22 తేదీల్లో ఇంజినీరింగ్‌, సెప్టెంబ‌ర్ 23 నుంచి 25 వ‌ర‌కు అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల్లో ప్రవేశాల‌ కోసం ఎంసెట్ ప‌రీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి: https://sche.ap.gov.in/EAMCET/EamcetHomePages/Home.aspx

Read more RELATED
Recommended to you

Latest news