ఉగాది ఉజ్వల భవిష్యత్తును తేవాలి : ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో.. సుఖసంతోషాలతో వెల్లివిరవాలని ఆకాంక్షించారు. ఈ తెలుగు నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉల్లాసాన్నీ, ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలని కోరుకున్నారు. శోభకృత్‌ నామ ఉగాదిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ  శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సంతోషాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలకు ప్రగతి శోభ రావాలి. చీకట్లు తొలగిపోయి అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నవోదయం రావాలి’ అని చంద్రబాబు ఆకాంక్షించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

శోభకృత్‌ నామ సంవత్సరం ప్రవేశిస్తున్న ఈ శుభ ఘడియల్లో తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరి జీవితాలు శోభాయమానం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news