ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

-

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 17న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లకు సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని ఏపీపీఎస్సీ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా నియమ, నిబంధనలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంటి ఏపీపీఎస్సీ.

Read more RELATED
Recommended to you

Latest news