మోడీ – పవన్ బేటి తర్వాత ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతోంది – విష్ణువర్ధన్ రెడ్డి

-

ప్రధానమంత్రి మోడీ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని అన్నారు ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి. బీజేపీ లైన్.. జనసేన లైన్ ఒక్కటేనన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ వ్యాఖ్యలను మేమూ సమర్థిస్తున్నాం అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ – జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యం అన్నారు.

పెద్ద పార్టీలని చెప్పుకుంటున్న చాలా పార్టీలు కముమరుగైన పరిస్థితి ఉందన్నారు. టీడీపీ బలమైన పార్టీ అయితే తెలంగాణలో ఎందుకు కనుమరుగైంది.? ఏపీలో ఎందుకు చతికిలపడింది..? అని ప్రశ్నించారు. టీడీపీని భుజాల మీద మోయాల్సిన అవసరం బీజేపీ – జనసేనకు లేదన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక నేటి రాత్రికి ప్రధాని మోదీ ఏపీకి రానున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news