షర్మిల పార్టీ విలీనంతో ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు – అంజద్ బాషా

-

వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో షర్మిల సేవలను ఉపయోగించుకోవాలనే పార్టీ ఆలోచనకు అనేక తర్జనభర్జనల తర్వాత షర్మిల అంగీకరించారు. ఏపీ నుంచి షర్మిల పోటీ చేయనున్నట్లు సమాచారం. షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం కొంతవరకైనా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది.

అయితే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం పట్ల తాజాగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాష. షర్మిల పార్టీ విలీనం అనేది ఆమె వ్యక్తిగత విషయమని.. ఆ అంశానికి ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు అంజద్ బాష. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు వైసిపి సిద్ధంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news