జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

-

వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలకుండా, అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న జనసేన ఆ దిశగా పావులు కదుపుతుంది. ఏపీ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారుతామనుకున్న జనసేన పార్టీ 2019 ఎన్నికలలో బొక్క బోర్ల పడిన విషయం తెలిసిందే. ఒంటరిగా పోటీ చేసిన కొన్ని ఎంపీ మరియు ఎమ్మెల్యే స్థానాలలో కేవలం ఒక్క స్థానంలో మాత్రమే జనసేన విజయం సాధించింది.

ఇక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మొదటిసారి పోటీ చేసిన జనసేనకు ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పాలి. అయినప్పటికీ జనసేనాని ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ప్రజల మధ్యకు వెళుతూ వాళ్ళ తరఫున అధికార వైసీపీని ప్రశ్నిస్తూ కార్యకర్తల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడకు చెందిన దాసరి కిరణ్ కుమార్ ను నియమించారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కిరణ్ పార్టీకి సేవలు అందిస్తున్నారు. అధికార ప్రతినిధిగా కిరణ్ సమర్థవంతంగా రాణించగలరని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆయనకి పార్టీ అధినేత అభినందనలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news