ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వెనకాడాల్సి వస్తుంది: ఏవీ సుబ్బారెడ్డి

-

తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని.. వాళ్లకు వివాహాలు చేయాల్సిన బాధ్యత ఉందని.. అందుకే వెనకాడాల్సి వస్తుందని.. లేకపోతే పాత ఏవీ సుబ్బారెడ్డిలా ఉండేవాడినని అంటున్నారు ఏవీ సుబ్బారెడ్డి. గతకొంతకాలంగా సైలంట్ ఉన్న సుబ్బారెడ్డి… తాజా వ్యవహారంతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. అఖిల ప్రియ – ఆమె భర్త తనను హత్యచేయించడానికి కుట్రపన్నారని, రూ. 50 లక్షలు సుపారీ కూడా ఇచ్చారని సుబ్బారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు కూడా పక్కా సమాచారం సంపాదించారని తెలుస్తోంది. అయితే… తాను గతంలో ఎలా ఉండెవాడిని.. ఇప్పుడు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది.. ఆళ్లగడ్డలో తనను చంపడానికి ఎవరు వస్తారు అనే విషయాలపై తాజాగా సుబ్బారెడ్డి స్పందించారు.

తన సంగతి అందరికి తెలుసు కాబట్టి.. తనను చంపడానికి ఆళ్లగడ్డలో ఎవరూ ముందుకు రారని చెబుతున్నారు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి. తన హత్యకు కుట్ర పన్నింది నూటి నూరుశాతం భూమా అఖిలప్రియ దంపతులేనని సుబ్బారెడ్డి నొక్కి చెబుతున్నారు. ఆ ప్రాంతంలో తనపై అటాక్ చేయాలంటే అంత చిన్న విషయం కాదని, అందుకే అఖిల ప్రియ మాజీ నక్సలైట్‌ ను ఎన్నుకున్నారన్నారని సుబ్బారెడ్డి అభిప్రాయపడుతున్నారు. భూమా నాగిరెడ్డి ఉన్న సమయంలో జరిగిన ప్రతీ గొడవలోనూ తన పాత్ర ఉందని చెబుతున్న సుబ్బారెడ్డి… తనపై దాదాపు 28 కేసులు ఉన్నాయని, అవన్నీ ఇప్పుడు కొట్టివేశారని తెలిపారు.

అయితే తాను పాత సుబ్బారెడ్డిలా ఉండకపోవడానికి తనకు ఉన్న ముగ్గురు కూతుర్లే కారణం అని చెబుతున్నారు సుబ్బారెడ్డి. తనకు ముగ్గురు కుమార్తెలు ఉండటం, వాళ్లకు వివాహాలు చేయాల్సిన బాధ్యత ఉండటంవల్లే వెనకాడాల్సి వస్తుంది. అయినా కానీ.. తనకు అన్యాయం జరిగితే మాత్రం దేనికైనా సిద్ధపడతానని సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news