పవన్,బాబు కప్పు కాఫీ తాగారు..వైసీపీ నాయకులు 3 చెరువుల నీళ్లు తాగారు – అయ్యన్న

-

పవన్‌ – బాబు భేటీపై వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ అయ్యన్న పాత్రుడు. నిన్న చంద్రబాబు, పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, వీరి భేటీ పై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

అయితే, వైసీపీ నేతల ట్వీట్లకు టీడీపీ నేత సోమిరెడ్డి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు. బాబు-పవన్ భేటీతో వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని.. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడండంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. అలాగే మాజీ మంత్రి అయ్యాన్న పాత్రుడు కూడా తన స్టైల్ లో స్పందించారు.పవన్,బాబు కప్పు కాఫీ తాగారు..వైసీపీ నాయకులు 3 చెరువుల నీళ్లు తాగారు అంటూ అయ్యన్న పాత్రుడు ఏద్దేవ చేశారు.ఈ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news