తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ పేరు మార్చేందుకు బాబు నిర్ణయం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. తిరుమల తిరుపతి ఎయిర్ పోర్టు పేరు మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. తిరుపతి ఎయిర్పోర్ట్ పేరును మార్చి శ్రీ వెంకటేశ్వర ఎయిర్ పోర్టు గా మార్చాలని… చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. ఏ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారట.

Babu’s decision to change the name of Tirupati Airport

ఇందులో భాగంగానే పార్లమెంటులో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు పౌర విమానయాన సహాయ మంత్రి మురళీధర్. ఇది ఇలా ఉండగా, ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ సీఎం చంద్రబాబు. రేపు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించనున్న చంద్రబాబు…. ఈ మేరకు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది ఏపీ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news