బండి సంజయ్ ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఆయనకే తెలియాలి – ఏపీ మంత్రి ఆదిమూలపు

-

తెలంగాణ బిజెపి నేత బండి సంజయ్ ఏపీలో ఎవరికి మద్దతుగా మాట్లాడుతున్నారో ఆయనకే తెలియాలని అన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. బుధవారం ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలని అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సెల్ ఫోన్ కనిపెట్టాను, టెక్నాలజీ అంతా నాకే తెలుసు అని చెప్పుకునే చంద్రబాబు.. అదే టెక్నాలజీ దొంగ ఓట్లను ఏరిపారేస్తుందన్నారు.

దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది కదా.. ఇక తప్పిదం ఎక్కడుందని ప్రశ్నించారు. ఎర్రగొండపాలెం లో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు వేసిన వాళ్ళు ఎవరో తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ వాళ్లు రాళ్లు వేశారని తెలితే తాను రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news