వృద్ధుడి ప్రాణం తీసిన బాట పంచాయతీ

-

తాండూరు నియోజకవర్గం యాలాల మండలం లోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన సూర్క రామప్ప కి, అతని దాయాదుల మధ్య కావలికారు ఇంటి సమీపంలోని కొంతకాలంగా బాట విషయంలో గొడవలు జరుగుతున్నాయి.ఈ విషయంపై శనివారం ఉదయం రామప్ప ఇంటివద్ద ముగ్గురు దాయాదులు మరోసారి గొడవ పడినట్లు తెలిసింది.ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దుండగులు బండరాళ్లతో రామప్ప తలపై బలంగా కొట్టారు.

దీంతో రామప్ప రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న యాలాల ఎస్సై అరవింద్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.హత్యకు పాల్పడిన నిందితులు పోలీసులకు లొంగి పోయినట్లు తెలిసింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news