చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా? : షర్మిల ట్వీట్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అయితే.. దీనిపై వైఎస్‌ షర్మిల.. మంత్రి కేటీఆర్‌ కు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. చిన్నదొరకు తెలంగాణలో దోస్తులు లేరా? అని ప్రశ్నించారు. ఇక్కడి సమస్యలు చెప్పట్లేదా? KCR, KTR కు తెలంగాణలో అరాచకాలు కనిపించడం లేదా ? అని నిలదీశారు వైఎస్‌ షర్మిల.

రైతులు,నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తలేవా? అమరుల కుటుంబాల బాధలు,ఉద్యమకారుల గోడు వినిపించడం లేదా ? అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు. మీ దరిద్రపు పాలన చాలక దేశం ఏలడానికి పోతారా ? అని ఆగ్రహించారు.

తెలంగాణ ఫ్రెండ్స్ ఉంటే రైతుల గోసలు, ఉాపాధి హామీ పనికి పనిచేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని అర్థం అయ్యేది అంటూ విమర్శించారు. చిన్న దొరకు ఆంధ్ర వాళ్లే ఫ్రెండ్స్ అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news